‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే దాశరథి స్ఫూర్తితో నేడు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా అభివృద్ధి చేసుకున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సాహితీ యోధునికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. గజల్ రుబాయీల వంటి ఉర్ధూ, పార్శీ సాహిత్య సాంప్రదాయాలను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టి తెలంగాణ గంగా జమునా తెహజీబ్ కు వారథి కట్టిన అక్షరసారథి దాశరథి అని సీఎం కొనియాడారు.
దాశరథి యాదిలో ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. దాశరథి సాహితీ పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా తెలంగాణ సాహితీ మూర్తులను నగదు పురస్కారాలతో సత్కరించుకుంటూ గౌరవించుకుంటున్నామని సీఎం తెలిపారు. 2021 సంవత్సరానికి గాను దాశరథి సాహితీ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ