తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) గా ఆమోదిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో రేపు (డిసెంబర్ 9, శుక్రవారం) మధ్యాహ్నం 1.20 నిమిషాలకు, దివ్య ముహూర్త సమయాన “భారత్ రాష్ట్ర సమితి” ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని, అందుకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ప్రారంభించాలని, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో రేపు మధ్యాహ్నం 1.20 నిమిషాలకు, సీఎం కేసీఆర్ కు అందిన అధికారిక లేఖకు రిప్లైగా సంతకం చేసి ఎన్నికల సంఘానికి అధికారికంగా పంపించడం జరుగుతుందని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని, అలాగే పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని సీఎం కేసీఆర్ కోరారు. వీరితో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవన్ కు చేరుకోవాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE