నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా వాదనలు జరిగాకా, ముందుగా ఎంపీ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రఘురామరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడీషియల్ అధికారిని నియమించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. అదేవిధంగా వైద్య పరీక్షలను వీడియోతో చిత్రీకరించి, సీల్డ్ కవర్లో నివేదిక అందజేయాలని ఆదేశించింది. వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులను మొత్తం ఎంపీ రఘురామకృష్ణరాజు భరించాలని కోర్టు పేర్కొంది. ఇక బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ