కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరియు పలువురు జాతీయస్థాయి నేతలకు శుక్రవారం ఫోన్లు చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, యూపీ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్, బీహార్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు జాతీయ నాయకులతో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీ సర్కార్ విధానాలపై తమ గళం వినిపించాలని, కేంద్రంపై పోరాటానికి కలిసి రావాలని కోరారు. ఈ అంశంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విపక్ష పార్టీలు ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని కేసీఆర్ వారికి సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ