రంజాన్ మాసం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా నేడు నగరంలోని ఎల్బీ స్టేడియంలో దీనిని నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే తన కార్యదర్శి భూపాల్ రెడ్డిని ఆదేశించిన నేపథ్యంలో.. అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. విందుకు మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయని, దాదాపు 13 వేల మందికి ఆహ్వానాలు పంపామని ఈ సందర్భంగా మంత్రులు వెల్లడించారు. ఇక ఇఫ్తార్ పార్టీకి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా వీవీఐపి, వీఐపీతో పాటు ఇతర పాస్లు జారీ చేస్తున్నామని, సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, ఇతర ముస్లిం మత పెద్దలు ప్రధాన వేదికపై ఉంటారని, మిగిలిన వారికి వేదికకు ఇరువైపులా ఏర్పాటు చేసినట్టు వారు వివరించారు. గత 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇఫ్తార్ దవాత్ ఇస్తున్నారని, ఈ సంవత్సరం 4 లక్షల 50 వేల గిఫ్ట్ ప్యాక్లను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. అలాగే అనాథ ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బట్టల పంపిణీ చేయనున్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE