బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు రంగం సిద్ధం అయింది. ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపే (డిసెంబర్ 14, బుధవారం) ప్రారంభించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.37-12.47 గంటల మధ్యలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. కాగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్, పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు, రాజకీయ నాయకులు హాజరుకానున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం విజయవంతం కావాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళ, బుధవారాల్లో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల కోసం సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత విషయాలపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE