టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో జరగనున్న ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ సూచించారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 1 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ ప్రకటించారు. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో రేపు జరిగే సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం తీసుకోవాల్సిన చర్యలు, సమాయత్తం కావల్సిన తీరుపై నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ