తక్షణ సహాయంగా 1350 కోట్లు ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

CM KCR, CM KCR Wrote a Letter to PM Modi, Hyderabad Rain Today, Hyderabad Rains, Hyderabad Rains news, KCR Urged to Release 1350 Cr Immediately for Rehabilitation Works, Rehabilitation Works, Telangana rains, telangana rains news, telangana rains updates

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో సహా హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 20 =