తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మునుగోడులో ఉపఎన్నిక రానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కొద్దీసేపటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి స్ట్రాటజీ, క్యాంపెయిన్ కమిటీని నియమిస్తున్నట్టుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటించింది. కమిటీ కన్వీనర్, సభ్యుల వివరాలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిటీ వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు.
మునుగోడు ఉపఎన్నికకై కాంగ్రెస్ స్ట్రాటజీ, క్యాంపెయిన్ కమిటీ:
- మధుయాష్కీ గౌడ్ – కన్వీనర్
- రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి
- బలరాంనాయక్
- సీతక్క
- అంజన్ కుమార్ యాదవ్
- ఎస్.ఎ.సంపత్ కుమార్
- ఎరావత్రి అనిల్ కుమార్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY