తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్గా మజ్లిస్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హజన్ జాఫ్రీ నియమితులయ్యారు. అమీనుల్ హజన్ జాఫ్రీని ప్రొటెం చైర్మన్గా నియమిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొటెం చైర్మన్ గా జనవరి 11, మంగళవారం నుంచే అమీనుల్ హజన్ జాఫ్రీ నియామకం అమల్లోకి వస్తుందని, తదుపరి మండలి చైర్మన్ ను ఎన్నుకునే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ముందుగా గత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ల పదవీకాలం ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మన్గా నియమించారు. భూపాల్ రెడ్డి కూడా జనవరి 4తో పదవీవిరమణ పొందిన నేపథ్యంలో నూతన ప్రొటెం చైర్మన్ నియామకం చేపట్టారు. కాగా ఈసారి ప్రొటెం చైర్మన్గా శాసనమండలిలో మజ్లిస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ అమీనుల్ హజన్ జాఫ్రీకి అవకాశమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ