తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం దిశగా వెళ్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 490 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 8, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,38,459 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 45 కేసులు నమోదయ్యాయి. కరోనా రికవరీ రేటు 99.45 శాతంకాగా, మరణాల రేటు 0.49 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 84 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,33,858 కు చేరుకుంది. ప్రస్తుతం 490 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. శనివారం నాడు 8,809 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,77,36,968 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,13,890 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 299 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY