తెలంగాణలో 10 వేలు దాటిన కరోనా కేసులు, 225 కి చేరిన మరణాలు

Covid-19 In Telangana, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో మరో 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 24, బుధవారం నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10444 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 4069 సాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఐదుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 225 కి పెరిగింది.

రాష్ట్రంలో కొత్తగా జీహెచ్‌ఎంసీ ఏరియాలో 719, రంగారెడ్డిలో 86, మేడ్చల్ లో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మంలో 4, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలలో 3 కేసుల చొప్పున, సంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో 2 కేసులు చొప్పున, కామారెడ్డి, సిద్ధిపేట, సిరిసిల్ల, గద్వాల్, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో ఒక్కో కేసు చొప్పున 891 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 137 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4361 కి చేరింది. ప్రస్తుతం 5858 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =