తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1831 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 6, సోమవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,733 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. సోమవారం నాడు 6,383 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 306 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 2078 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 14781 కి చేరింది. ప్రస్తుతం 10646 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1831):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1419
- రంగారెడ్డి – 160
- మేడ్చల్ – 117
- ఖమ్మం – 21
- మంచిర్యాల – 20
- మెదక్ – 20
- మహబూబ్ నగర్ – 9
- నల్గొండ – 9
- వరంగల్ రూరల్ – 9
- నిజామాబాద్ – 9
- పెద్దపల్లి – 9
- వికారాబాద్ – 7
- సూర్యాపేట – 6
- కరీంనగర్ – 5
- జగిత్యాల – 4
- సంగారెడ్డి – 3
- గద్వాల్ – 1
- నారాయణపేట్ -1
- యాదాద్రి – 1
- మహబూబాబాద్ – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu