ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 21,211 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 75 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా విశాఖపట్నంలో 17, చిత్తూరులో 13, గుంటూరులో 10, కృష్ణాలో 8, తూర్పుగోదావరిలో 8 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,75,879 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14480 కు చేరింది. గత 24 గంటల్లో 154 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 20,59,882 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,517 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ