తెలంగాణ రాష్ట్రంలో మరో 1879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 6,220 శాంపిల్స్ పరీక్షించగా 4,341 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 7 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 313 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1506 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 16287 కి చేరింది. ప్రస్తుతం 11012 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1879):
- జీహెచ్ఎంసీ ఏరియా – 1422
- రంగారెడ్డి – 176
- మేడ్చల్ – 94
- కరీంనగర్ – 32
- నల్గొండ – 31
- నిజామాబాద్ -19
- వరంగల్ అర్బన్ -13
- మెదక్ -12
- ములుగు -12
- మహబూబ్ నగర్ -11
- సంగారెడ్డి – 9
- సూర్యాపేట – 9
- కామారెడ్డి – 7
- జయశంకర్ భూపాలపల్లి – 6
- గద్వాల్ – 4
- పెద్దపల్లి – 3
- ఖమ్మం – 3
- భద్రాద్రి కొత్తగూడెం – 3
- జగిత్యాల – 2
- మహబూబాబాద్ – 2
- రాజన్న సిరిసిల్ల – 2
- నాగర్ కర్నూల్ – 2
- వికారాబాద్ – 1
- జనగామ – 1
- ఆదిలాబాద్ – 1
- వనపర్తి – 1
- సిద్దిపేట – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu