తెలంగాణలో 32 వేలు దాటిన కరోనా కేసులు, 339 కి పెరిగిన మరణాలు

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 32,224 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు 10,354 శాంపిల్స్ పరీక్షించగా 9076 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 339 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1013 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 19,205 కి చేరింది. ప్రస్తుతం 12,680 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1278):

  1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 762
  2. రంగారెడ్డి – 171
  3. మేడ్చల్ – 85
  4. సంగారెడ్డి – 36
  5. నల్గొండ – 32
  6. కామారెడ్డి – 23
  7. మెదక్ – 22 
  8. ఖమ్మం – 18
  9. మంచిర్యాల – 17
  10. సూర్యాపేట – 14
  11. ఆదిలాబాద్ – 14
  12. మహబూబ్ నగర్ – 14
  13. కరీంనగర్ – 9
  14. నారాయణపేట్ – 9
  15. వరంగల్ రూరల్ – 8
  16. నిజామాబాద్ – 8
  17. రాజన్న సిరిసిల్ల – 7
  18. మహబూబాబాద్ – 6
  19. పెద్దపల్లి – 6
  20. వరంగల్ అర్బన్ – 5
  21. సిద్దిపేట – 4
  22. జనగామ – 3
  23. గద్వాల్ – 1
  24. వనపర్తి – 1
  25. ఆసిఫాబాద్ – 1
  26. నిర్మల్ – 1
  27. యాదాద్రి – 1

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 10 =