దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 10, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 26,506 కరోనా పాజిటివ్ కేసులు, 475 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 21,604 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 4,95,513 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 2,76,685 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉండడం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 62.42 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. అలాగే కరోనా మరణాల్లో మాత్రం భారత్ ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో కొనసాగతుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 10 July, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 793,802
▶️ Active cases: 276,685
▶️ Cured/Discharged/Migrated: 495,513
▶️ Deaths: 21,604#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/fM5wc4ysel
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) July 10, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu