తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో జూలై 17, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు కొత్తగా 1478 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 1410 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 28,705 కి చేరగా, ప్రస్తుతం 13,389 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే కరోనా వలన మరణించిన వారి సంఖ్య 403 కి చేరుకుంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1478):
- జీహెచ్ఎంసీ – 806
- రంగారెడ్డి – 91
- మేడ్చల్ – 82
- కరీంనగర్ – 77
- వరంగల్ అర్బన్ – 51
- పెద్దపల్లి – 35
- నల్గొండ – 35
- కామారెడ్డి – 31
- రాజన్నసిరిసిల్ల – 27
- మెదక్ – 23
- నాగర్కర్నూల్ - 23
- సూర్యాపేట – 20
- సంగారెడ్డి – 20
- మహబూబ్నగర్ – 19
- ఖమ్మం – 18
- వికారాబాద్ – 17
- మంచిర్యాల – 15
- నారాయణపేట – 14
- యాదాద్రి భువనగిరి – 11
- కొమరంభీం ఆసిఫాబాద్ – 11
- నిజామాబాద్ – 11
- మహబూబాబాద్ – 11
- జనగామ – 10
- సిద్దిపేట – 8
- జగిత్యాల – 4
- జయశంకర్భూపాలపల్లి – 2
- వనపర్తి – 2
- జోగుళాంబ గద్వాల – 2
- భద్రాద్రికొత్తగూడెం – 1
- ములుగు – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu