తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 441 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 17, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,09,778 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక గత 24 గంటల్లో 692 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 8,01,018 కు చేరుకుంది. ప్రస్తుతం 4,649 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు.
మరోవైపు కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. కరోనా రికవరీ రేటు 98.92 శాతంకాగా, మరణాల రేటు 0.51 శాతంగా నమోదైంది. ఆదివారం నాడు 21,616 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,60,39,789 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 9,68,291 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఇంకా 344 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY