ఉపరాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా ను బరిలో దించాలని విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్పవార్ నివాసంలో ఆదివారం జరిగిన 17 పార్టీల భేటీలో నిర్ణయించారు. అల్వా పేరును పార్టీలన్నీ ముక్త కంఠంతో ఆమోదించినట్టు భేటీ తర్వాత పవార్ తెలిపారు. కాగా మార్గరెట్ అల్వా మాజీ కేంద్ర మంత్రి మరియు నాలుగుసార్లు గవర్నర్గా పనిచేసిన అనుభవం ఉన్నవారు. ఒకవైపు బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎన్డిఎ తన అభ్యర్థిగా ఎంపిక చేసిన దరిమిలా విపక్షాలు అల్వాను తమ అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. దీనిని నిర్ధారిస్తూ.. శ్రీమతి అల్వా ట్వీట్ చేశారు. “భారత ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి ప్రతిపక్షం అభ్యర్థిగా నామినేట్ కావడం ఒక అదృష్టం మరియు గౌరవం. నేను ఈ నామినేషన్ను చాలా వినయంతో అంగీకరిస్తున్నాను. అలాగే నాపై విశ్వాసం ఉంచినందుకు ప్రతిపక్ష నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ