దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత రెండ్రోజుల నుంచి 2 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవగా, వరుసగా 16వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం భారీ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,73,790 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,77,29,247 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 3617 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,22,512 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 22,28,724 (8.04%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా తమిళనాడు (31,079), కర్ణాటక (22,823), కేరళ (22,318), మహారాష్ట్ర (20,740), ఆంధ్రప్రదేశ్ (14,429), వెస్ట్ బెంగాల్ (12,193), ఒడిశా (7,256), అస్సాం (5,436), పంజాబ్ (3,706), తెలంగాణ (3,527) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 2,84,601 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,51,78,011 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 90.80 శాతం గానూ, మరణాల రేటు 1.16 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ