తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మే 29, శనివారం రాత్రి 10 గంటల వరకు 45,57,889 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 13,58,148 మంది లబ్ధిదారులకు రెండవ డోసు కలిపి మొత్తం 59,16,037 కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా శనివారం నాడు 82179 మందికి మొదటి డోస్, 28383 మందికి రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో మే 29 వరకు జరిగిన మొత్తం కరోనా వ్యాక్సినేషన్ వివరాలు:
- హెల్త్ కేర్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,46,469
- హెల్త్ కేర్ వర్కర్స్ (రెండో డోసు) : 1,89,612
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (మొదటి డోసు) : 2,51,115
- ఫ్రంట్లైన్ వర్కర్స్ (రెండో డోసు) : 97,047
- 45 ఏళ్లు పైబడినవారు (మొదటి డోసు): 39,37,501
- 45 ఏళ్లు పైబడినవారు (రెండో డోసు): 10,71,489
- 18-44 ఏళ్ల వయసు వారు (మొదటి డోసు): 1,22,804
- మొత్తం అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య : 59,16,037
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ