దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇటీవల రోజువారీగా 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,158 కేసులు నమోదు కావడంతో జనవరి 16, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841 కు చేరుకుంది. కరోనాతో మరో 175 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,52,093 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే కోటి ఒక లక్ష 79 వేల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కొత్తగా 16,977 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,01,79,715 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.56 శాతం గానూ, మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. ప్రస్తుతం 2,11,033 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైనా 15,158 కేసులలో 80.81 శాతం ఈ 8 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ