ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరవనున్నారు. ఈ కేసులో ఈనెల 11న ఒకసారి ఆమెను దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు, నేడు మరోసారి విచారించనున్నారు. ఇక ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత, బుధవారం ఢిల్లీలోని మెరిడియన్ హోటల్లో మహిళా రిజర్వేషన్పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ ఉదయం 11.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. మరోవైపు బుధవారం ఈడీ అధికారులు హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై మరియు ఆడిటర్ బుచ్చిబాబులను కలిపి విచారించినట్లు సమాచారం.
కాగా గతంలో కవిత తరఫున తాను బినామీగా వ్యవహరించినట్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ తాజాగా పిళ్లై కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత నేటి విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. పిళ్లైతో తనకు సంబంధం లేదని కవిత చెప్పినా.. వారిద్దరినీ ముఖాముఖి ప్రశ్నించి వాస్తవాలను రాబట్టేందుకు ఈడీ ప్రయత్నించే అవకాశాలున్నాయని ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే ఆమెను అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అధికార బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు, మహిళా నేతలు ఢిల్లీకి చేరుకొని కవితకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE