రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “ఈ రోజు కరోనా పరీక్షలో నాకు రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాలు లేవు మరియు బాగానే ఉన్నాను. కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించి ఐసోలేషన్ లో ఉంటూ పని చేస్తూనే ఉంటాను” అని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. ముందుగా బుధవారం నాడు సీఎం అశోక్ గెహ్లాట్ సతీమణికి లక్షణాలు లేకుండా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, ముందు జాగ్రత్త చర్యగా సీఎం అశోక్ గెహ్లాట్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ