ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు (మార్చి 16, గురువారం) ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ 2023-24ను శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం శాసనసభలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ను కూడా కేబినెట్ ఆమోదించింది. రూ.2.79 లక్షల కోట్లతో ఈ వార్షిక బడ్జెట్ ఉండే అవకాశముంది. కాగా శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, శాసనమండలిలో వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ప్రవేశపెట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE