బంగాళాఖాతంలో ఏర్పడి మే 20, బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకినా పెను తుఫాన్ “అంఫాన్” అల్లకల్లోలం సృష్టించింది. ముఖ్యం ఈ పెను తుఫాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. తుఫాన్ తీరం దాటిన సమయంలో అత్యంత బీకరమైన గాలులు, భారీ వర్షం కురవడంతో భారీగా ఆస్తి మరియు ప్రాణ నష్టం సంభవించింది. “అంఫాన్” ప్రభావంతో ఇప్పటివరకు 84 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. కాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే 72 మంది మృతి చెందినట్లుగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వెల్లడించారు.
తుపాను తీవ్రతతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు నుంచి రూ.2.5 లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు మమతా బెనర్జీ ప్రకటించారు. చాలా సంవత్సరాల తర్వాత అంఫాన్ తుఫాన్ భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పారు. ఒడిశా రాష్ట్రంలో కూడా భారీ వర్షం కురియడంతో ఆస్తి నష్టం, పంట నష్టం కలిగినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు రాష్ట్రాలలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇక బంగ్లాదేశ్లో కూడా ఈ తుఫాన్ ప్రభావంతో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu