దుబ్బాకలో 22 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. ఇప్పటికి బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు 1038 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం మారుతుండడంతో ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకుంది. 22 రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 61,119, టిఆర్ఎస్ కు 60,063, కాంగ్రెస్కి 21239 ఓట్లు లభించాయి. ఇక మరో రౌండ్ ఫలితాలు వెలువడాల్సి ఉంది.
ముందుగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొల్పిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేయగా, మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. అలాగే 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కించనున్నారు. తుదిపలితం సాయంత్రం 4 గంటలలోగా వెలువడే అవకాశం ఉంది. నవంబర్ 3న జరిగిన పోలింగ్ లో 164192 ఓట్లతో 82.61 పోలింగ్ శాతం నమోదైంది. దుబ్బాక పోరులో 23 మంది బరిలో ఉన్నప్పటికీ, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మధ్యే త్రిముఖ పోటీ నెలకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ