ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. “అన్నయ్య చిరంజీవి గారు లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు – ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య చిరంజీవి కరోనా బారినపడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది. అన్నయ్య చిరంజీవి సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుందని అన్నారు. మరో వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ