హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 19న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ఈ కేబుల్ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.184 కోట్ల వ్యయంతో 754.38 మీటర్ల పొడవుగా ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీకి అప్పగించగా, పూర్తిగా కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. దేశంలో కేబుల్ టెక్నాలజీతో నిర్మించబడ్డ తొలి బ్రిడ్జిగా ఇది గుర్తింపు పొందింది. రెండేళ్లలో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్ ప్రాంతానికి ట్రాఫిక్ సమస్య లేకుండా త్వరగా చేరుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu