తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలు స్వేరోస్, బహుజన సమ్మేళనాల్లో పాల్గొని, బహుజనులకు రాజ్యాధికారం, మార్పుకోసం ఆయన పిలుపునిస్తున్నారు. తాజాగా ఆయన రాజకీయ అరంగ్రేటానికి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 8న నల్గొండలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ రాజకీయ సంకల్ప సభ నిర్వహించనున్నారు.
నల్గొండలో ఎన్.జీ కళాశాలలో జరిగే ఈ సభలోనే బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి సమక్షంలో ప్రవీణ్కుమార్ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) లో చేరనున్నారు. ఈ సభకు బీఎస్పీ నేషనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్ సహా, పలువురు బీఎస్పీ నాయకులు, అభిమానులు, స్వేరో కార్యకర్తలు, పెద్దఎత్తున ఈ సభకు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ