బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన అనంతరం ఆమెకు 14 రోజుల పాటుగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారం నాడు విచారణ జరిగింది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరిస్తూ, బెయిల్ మంజూరుకు నిరాకరించింది. మరోవైపు విచారణ నిమిత్తం అఖిలప్రియ కస్టడీ కోసం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. 3 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి మంజూరు చేసింది.
దీంతో జనవరి 11, సోమవారం నుండి జనవరి 13, బుధవారం వరకు ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించనున్నారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1గా భూమా అఖిలప్రియ, ఏ2 గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ3 గా భార్గవ రామ్ ఉన్నారు. వీరితో పాటుగా మరొకొందరిని నిందితులుగా చేర్చి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ