మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ అయి పార్టీలో చేరిక సహా పలు అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో బీజేపీలోకి చేరేందుకు ఈటల రాజేందర్ ముహూర్తం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. జూన్ 13న ఢిల్లీలో జేపీ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఈటలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ నేత తులా ఉమ, పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరే అవకాశముంది. మరోవైపు బీజేపీలో చేరేముందే తన ఎమ్మెల్యే పదవి రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు లేదా స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని ఈటల రాజేందర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ