హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో వైఎస్ షర్మిల భేటీ

#YSSharmila, AP Politics, Lotus Pond, Mango News, Rajanna Rajyam In Telangana, Rangareddy Districts YSR Loyalists, Sharmila New Party, telangana, ycp in telangana, YS Sharmila, YS Sharmila About Rajanna Rajyam, YS Sharmila About Rajanna Rajyam In Telangana, YS Sharmila held Meeting with Hyderabad, YS Sharmila Intensifies Work Towards Party Launch, YS Sharmila Intensifies Work Towards Party Launch In Telangana, YS Sharmila New Party, YS Sharmila New Political Party Announcement

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ సోదరి వైఎస్ షర్మిల శనివారం నాడు హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దాదాపు 500 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని, రాజన్న సంక్షేమ పాలన తేవాలన్నదే తన కోరిక అని చెప్పారు. జై తెలంగాణ, జై వైఎస్ఆర్ అంటూ నినదించారు. సమావేశానికి హాజరైన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. వారి ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది?, పేద ప్రజలు ఎలా ఉన్నారు? ప్రభుత్వం వారి కోసం ఏం చేస్తుంది? వంటి విషయాలను చెప్పాలని సమావేశానికి హాజరైన వారిని కోరారు. అలాగే సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరించి, ప్రజల సహకారంతో మళ్ళీ అలాంటి స్వర్ణ యుగాన్ని తెచ్చుకుందామని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.

ముందుగా ఫిబ్రవరి 9 న నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమైన వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు తెలంగాణలోని అన్ని జిల్లాలవారితో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే జిల్లాలవారీగా వరుసగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + nineteen =