మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి ఇటీవలే ఈటల రాజేందర్ ను తొలగించిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జేపీ నడ్డాతో భేటీ ప్రాధానత్య సంతరించుకుంది. ఈ భేటీలో ఈటలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. పార్టీలో చేరిక, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. ఈ భేటీతో బీజేపీలో ఈటల చేరికపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ