కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరీక్షలను “అసైన్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్” పద్దతిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ఆ రెండు పరీక్షలుకు కేటాయించిన ప్రశ్నలకు అసైన్మెంట్ల రూపంలో ఇంట్లోనే సమాధానాలు రాసి, సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్స్ కు పంపించాలని సూచించారు. ఈ మేరకు ఇంటర్బోర్డు కార్యదర్శి జలీల్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వ తేదీ మధ్య నేరుగా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా పీడీఎఫ్ ఫార్మాట్ లో మెయిల్ ద్వారా అసైన్మెంట్లను విద్యార్థులు ప్రిన్సిపాల్స్ కు సమర్పించాలని చెప్పారు. అయితే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు ఏప్రిల్ 1 నుంచి https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ లో హాల్టికెట్లు డౌన్ లోడ్ చేసుకుని, అసైన్మెంట్ వర్క్ లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేయాలని సూచించారు. ఇక రెండవ సంవత్సరం విద్యార్థులు (రెగ్యులర్) ఎవరైనా ఈ రెండు పరీక్షల్లో క్వాలిఫై కాకుండా ఉంటే, వారు కూడా వారి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ వేసి అసైన్మెంట్లు సమర్పించాలని చెప్పారు. అలాగే పాత విద్యార్థులు (ప్రైవేట్) వారి గత రెండవ సంవత్సరం హాల్ టికెట్స్ ద్వారా ఈ పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ