మేడ్చల్ రైల్వేస్టేషన్లో మంగళవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్ లో నిలిపి ఉంచిన ఓ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. ఆ బోగీ నుంచి మరో బోగీకి కూడా మంటలు అంటుకున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తం కాగా, ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రైలు బోగీలో అగ్ని ప్రమాదం జరగడానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ