శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం: 9 మంది సిబ్బంది మృతి

Fire in Srisailam hydel power station, Fire Mishap at Srisailam Power Station, Massive fire erupts at Telangana power station, srisailam dam, Srisailam power house fire, Srisailam Power Plant, Srisailam Power Station, telangana, Telangana Srisailam Power Plant Fire

శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయిన 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలంగాణ విద్యుత్ శాఖ అధికారికంగా ప్రకటించింది. లోపల చిక్కుకున్నవారిని రక్షించేందుకు గంటల పాటుగా చేపట్టిన సహాయక చర్యలు ఫలించలేదు. సహాయక చర్యలు చేపడుతున్న బృందం ఇప్పటికీ ఎనిమిది మృతదేహాలను వెలికి తీసింది. మృతులను డీఈ శ్రీనివాస్, ఏఈ సుందర్‌, ఏఈ మోహన్‌కుమార్‌, ఏఈ ఉజ్మ ఫాతిమా, ఏఈ మోహన్‌కుమార్‌,‌ ప్లాంట్‌ అటెండెంట్‌ కిరణ్‌, అమరాన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్, మహేశ్‌ గా గుర్తించారు. మరోకరి కోసం రెస్క్యూ బృందం గాలింపు కొనసాగుతోంది. గురువారం రాత్రి ప్యానల్‌ బోర్డులో మంటలు రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − sixteen =