తెలంగాణ రాష్ట్రంలో రైతులకు వానాకాలం సీజన్ కు సంబంధించి రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీ జూన్ 28 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు వానాకాలం రైతుబంధు నిధుల విడుదలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు సోమవారం హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఇప్పటివరకు రాష్ట్రంలో 4 ఎకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.3946 కోట్లు విడుదల చేశామని చెప్పారు. 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు సంబంధించిన నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు.
నేటి నుంచి 5 ఎకరాలపైబడి ఉన్న రైతులకు రైతుబంధు నిధులు జమ:
ఇక నేటి (జూలై 5, మంగళవారం) నుంచి ఐదు ఎకరాలపైబడి ఉన్నరైతులకు రైతు బంధు నిధులు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని మంత్రి హరీశ్ రావు ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో నిధులు అందేలా చూడాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY