హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనాతో పోరాడి మే 20, బుధవారం మృతి చెందాడు. ఆయన వయసు 37 సంవత్సరాలు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముందుగా దయాకర్ కు సోమవారం నాడు కరోనా సోకినట్టుగా నిర్దారణ కాగా, గాంధీ ఆస్పత్రికి తరలించారు. కరోనాతో పోరాడుతూ, బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో అతను మృతి చెందాడు. మరోవైపు దయాకర్ కుటుంబ సభ్యులతోపాటు, అతనితో కలిసి పనిచేసిన కొంతమంది పోలీసుల యొక్క శాంపిల్స్ సేకరించి కరోనా వైద్య పరీక్షలకు పంపించారు.
కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ డీజీపీ మహేందర్రెడ్డి సంతాపం తెలిపారు. దయాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసు విభాగం దయాకర్ కుటుంబానికి అండగా ఉంటుందని డీజీపీ చెప్పారు.
#PoliceConstableOfficer Dayakar Reddy a #Covid19FrontLineWarrior of @hydcitypolice died of #CoronaVirus last night @ GandhiHospital.
My Heartfelt Condolences to the bereaved family members. The Govt & #TSPolice will standby & support the family in #TheHourOfDistress by all means. pic.twitter.com/6eybsLycfj— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 21, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu