బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరెకాపుడి గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎస్సార్డీపీ పనుల్లో భాగంగా బయోడైవర్శిటీ జంక్షన్ వద్ద మొదటి స్థాయి ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ రూ.30.26 కోట్ల వ్యయంతో నిర్మించింది. 690 మీ పొడవుగల ఈ ఫ్లైఓవర్ ను 480 మీటర్ల వయాడక్ట్ స్పాన్ పొడవు, 11.50 మీ. వెడల్పుతో నిర్మించారు. బయోడైవర్సిటీ వద్ద సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఇంతకుముందే ప్రారంభం కాగా, తాజాగా ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ కూడా అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి రాయదుర్గం మీదుగా మెహిదీపట్నం వైపుగా వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలిగిపోనున్నాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu