మునుగోడు ఉపఎన్నిక ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. పద్మశాలి సంఘ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేశారు. రాపోలు ఆనంద భాస్కర్ తన రాజీనామా లేఖను బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. దివంగత నేత అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతో 2019, ఏప్రిల్ 4న తనను పార్టీలో చేర్చుకున్నందుకు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా వివిధ కారణాలను పేర్కొంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుండి తక్షణమే వైదొలగుతున్నానని జేపీ నడ్డాకు రాసిన రాజీనామా లేఖలో ఆనంద భాస్కర్ తెలిపారు.
మరోవైపు రాపోలు ఆనంద భాస్కర్, త్వరలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గత ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎంను అభినందించారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట్ల రాపోలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని, తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతానని రాపోలు ఆనంద భాస్కర్ సీఎం కేసీఆర్ తో చెప్పారు.
Quitting #BJP @BJP4India
My letter to its National President @JPNadda ji pic.twitter.com/u0NESnHM8C— Ananda Bhaskar Rapolu (@ABRAPOLU) October 26, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY