జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక ప్రసంగం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా అమలు చేయబోయే పథకాలు, కార్యక్రమాల గురించి కూడా వివరించారు.
సీఎం కేసీఆర్ ప్రసంగం హైలైట్స్:
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. నాయకుల పనితీరు చూసే ఓటు వేయాలి.
- హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని మా బిడ్డలలాగానే చూసుకుంటాం. ఈ నగరం ఎంతో చైతన్యవంతమైనది. గొప్ప చరిత్ర కలది.
- హైదరాబాద్ నగరంలో గాని, రాష్ట్రంలో గాని కుల, మత, జాతి, ప్రాంత వివక్ష లేకుండా పాలనా సాగిస్తున్నాం.
- ఎన్నో అనుమానాలను చెదరగొట్టి నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం.
- రాబోయే కొద్ది నెలల్లో హైదరాబాద్ నగరంలో 24 గంటల వాటర్ సరఫరా సౌకర్యం ఏర్పాటు చేస్తాం.
- నగరంలో శాశ్వతంగా 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటి సరఫరా, 97 శాతం మంది ప్రజలకు లబ్ధి జరుగుతుంది. ఢిల్లీ తరవాత హైదరాబాద్ లోనే ఈ పథకం అమలు.
- పల్లెవెలుగు పథకం ద్వారా ప్రతి గ్రామపంచాయితీకి ఒక ట్రాక్టర్ ఉంది. ఒక వాటర్ ట్యాంకర్, నర్సరీ ఉంది. దేశంలో ఎక్కడా లేదు.
- కంటివెలుగు పథకం చరిత్రాత్మకం. 50-60 లక్షల మంది ప్రజలకు అద్దాలు, మందులతో వైద్య సదుపాయం కల్పించాం.
- కేసీఆర్ కిట్ రాష్ట్రంలో సూపర్ హిట్టు. కల్యాణ లక్ష్మి, బస్తిదవాఖానాలతో ప్రజలకు మేలు చేస్తున్నాం.
- బార్బర్ షాపులకు, సెలున్లకు ఉచిత విద్యుత్ సరఫరా.
- రాష్ట్రవ్యాప్తంగా లాండ్రిలకు, ధోబీఘాట్ లకు ఉచిత విద్యుత్.
- గోదావరితో మూసీనదిని అనుసంధానం చేసి ప్రక్షాళన చేస్తాం.
- మెట్రోను ఎయిర్ పోర్ట్ వరకు లింక్ చేస్తాం.
- కరోనాతో రాష్ట్రానికి రూ.52వేల కోట్ల ఆదాయం నష్టం వచ్చినా, సంక్షేమ పథకాలు మాత్రం ఆపలేదు.
- వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. సమగ్ర చర్యల కోసం బడ్జెట్ లో ఏటా 10వేల కోట్లు కేటాయిస్తాం.
- వరదల వలన ప్రభావితమైన 6.5 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున వరద సాయంగా రూ.650 కోట్లు ఇచ్చాం.
- డిసెంబర్ 7 నుంచి మళ్ళీ వరదసాయం పంపిణీ చేస్తాం. అర్హులైనవారందరికీ రూ.10వేల వరదసాయం అందిస్తాం.
- వరదల వల్ల కోట్లు నష్టపోయి సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే, 13పైసలు కూడా ఇవ్వలేదు. కానీ బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలకు సాయం చేశారు. మేం భారతదేశంలో లేమా?
- వరద బాధితుల ఆదుకునేందుకు రానివాళ్లు, ఓట్లు అడిగేందుకు వరదలా వస్తున్నారు.
- జీహెచ్ఎంసీ ఎన్నికలు అనగానే కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు. ఒక్క బక్క కేసీఆర్ను కొట్టడానికి ఇంత మంది రావాలా?
- హైదరాబాద్ నగరానికి పెద్దఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. టీపాస్ కావాలా లేదా కర్ఫ్యూ పాస్ కావాలా అనేది బిల్డర్లు ఆలోచించుకోవాలి.
- నగరంలో పటిష్టమైన శాంతిభద్రతలు ఏర్పాటు చేసాం, హైదరాబాద్ ఉన్నన్ని సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడా లేవు.
- హైదరాబాద్ను కాపాడుకునేందుకు ప్రజలు, యువత, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. పనిచేసే ప్రభుత్వానికి ఓటేసి మద్దతు ప్రకటించాలి.
- గతంలో కంటే ఇంకొన్ని సీట్లు ఎక్కువే గెలుస్తాం.
- మా బాసులు ఢిల్లీలో లేరు. తెలంగాణ ప్రజలే మా బాసులు. ప్రజల అవసరాలే ఇతివృత్తం. ప్రజల సమస్యలే కేంద్రబిందువు. ప్రజల బతుకుదెరువే మా ఆలోచన. పేదల సంక్షేమమే మా ఆలోచన. దేదీప్యమానంగా ఉండే తెలంగాణ మా కల.
- మంచి విజ్ఞత కలిగిన అభ్యర్థులను బరిలోకి దింపాము. ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ