గ్రేటర్ ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి మొత్తం 150 డివిజన్లకు గానూ టిఆర్ఎస్ పార్టీ 70 డివిజన్లలో (గెలుపు + ఆధిక్యం) ముందంజలో ఉంది. ఇక బీజేపీ 31, ఎంఐఎం 44, కాంగ్రెస్ 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.
- టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 16 డివిజన్స్ లో, ఎంఐఎం పార్టీ అభ్యర్థులు 14 డివిజన్స్ లో విజయం సాధించారు.
- హైదర్నగర్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం.
- రాంనాస్ పురా, దూద్ బౌలి, కిషన్ బాగ్ డివిజన్లలో ఎంఐఎం విజయం.
- అహ్మద్నగర్ లో ఎంఐఎం విజయం.
- డబీర్ పురా డివిజన్ లో ఎంఐఎం విజయం.
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఏఎస్ రావు నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు.
- యూసఫ్గూడలో టిఆర్ఎస్ పార్టీ విజయం. టిఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ విజయం సాధించారు.
- జీహెచ్ఎంసీ ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ బోణీ. మెట్టుగూడ డివిజన్ లో విజయం. టిఆర్ఎస్ అభ్యర్థి రాసూరి సునీత విజయం సాధించారు.
- జీహెచ్ఎంసీలో తోలి ఫలితం: మెహదీపట్నం డివిజన్ ను ఎంఐఎం పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి మజీద్ హుస్సేన్ గెలుపొందినట్టు ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని డివిజన్లకు సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ చేపడుతున్నారు. రౌండ్కు 14 వేల ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా తక్కువ శాతం పోలింగ్ జరిగిన డివిజన్లలో ఫలితాలు వెలువడుతున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ