జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఏఎస్ రావు నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి, ఉప్పల్ డివిజన్ నుంచి అభ్యర్థి రజిత విజయం సాధించారు. కాగా ఈ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుండగా, బీజేపీ పోటీ ఇస్తూ పలు స్థానాలు గెలుచుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోతుంది.
– జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడిక్ మెట్ డివిజన్ లో గెలుపొంది బీజేపీ పార్టీ బోణి కొట్టింది. అడిక్ మెట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి సునీతా ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. అలాగే ముషీరాబాద్, గచ్చిబౌలి స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పటికి మూడు స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, మరో 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఇప్పటివరకు ఎంఐఎం గెలుచుకున్న డివిజన్స్ ఇవే:
- మెహదీపట్నం
- డబీర్పురా
- రాంనాస్ పురా
- దూద్ బౌలి
- కిషన్ బాగ్
- నవాబ్ సాహబ్ కుంట
- బర్కాస్
- పతేర్గట్టి
- పురానాపూల్
- రియాసత్ నగర్
- అహ్మద్ నగర్
– జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. తోలి రౌండ్ కౌంటింగ్ లో ఇప్పటికి 57 డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ, 25 డివిజన్లలో బీజేపీ, 30 డివిజన్లలో ఎంఐఎం, 3 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది
– అహ్మద్నగర్ లో కూడా ఎంఐఎం విజయం. ఇప్పటిదాకా మూడు డివిజన్స్ గెలిచిన ఎంఐఎం
– హైదర్నగర్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు విజయం
– రాంనాస్ పురా, దూద్ బౌలి, కిషన్ బాగ్ డివిజన్లలో ఎంఐఎం విజయం
– డబీర్ పురా డివిజన్ లో ఎంఐఎం విజయం
– జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది. ఏఎస్ రావు నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిరీషారెడ్డి విజయం సాధించారు
– యూసఫ్గూడ డివిజన్ లో టిఆర్ఎస్ పార్టీ విజయం
– జీహెచ్ఎంసీ ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ బోణీ. మెట్టుగూడ డివిజన్ లో విజయం
– జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అన్ని డివిజన్లకు సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీలో తోలి ఫలితం వెలువడింది. మెహదీపట్నం డివిజన్ ను ఎంఐఎం పార్టీ గెలుచుకుంది. ఎంఐఎం పార్టీ అభ్యర్థి మజీద్ హుస్సేన్ గెలుపొందినట్టు తెలిపారు.
– టిఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్న డివిజన్స్:
- ఓల్డ్ మలక్పేట
- శేరిలింగంపల్లి
- గాజుల రామారం
- ఆర్.సి పురం
- పటాన్ చెరు
- ఖైరతాబాద్
- జూబ్లీహిల్స్
- చందానగర్
- బాలానగర్
- కాప్రా
- ఓల్డ్ బోయినపల్లి
- హైదర్ నగర్
- హఫీజ్పేట్
- సరూర్ నగర్
- బిఎన్ రెడ్డి నగర్
– బీజేపీ ఆధిక్యంలో ఉన్న డివిజన్స్:
- భారతి నగర్
- వనస్థలిపురం
– జీహెచ్ఎంసీలో అన్ని డివిజన్లకు సంబంధించి మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆర్.సి పురం, పటాన్ చెరు, హైదర్ నగర్, హఫీజ్పేట్, చందానగర్ లలో టిఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా, భారతి నగర్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
– జాంబాగ్ డివిజన్ లో ఓట్లు లెక్కింపుపై బీజేపీ అభ్యంతరం. ఓ బూత్ లో పోల్ అయిన ఓట్లకు, బాక్స్ లో ఉన్న బ్యాలెట్ లకు తేడా ఉండడంతో, మిగతా ఓట్లు గల్లంతు అయ్యాయని బీజేపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ శాతం తప్పుగా పేర్కొన్నామని అధికారులు తెలిపారు.
– పోస్టల్ బ్యాలెట్లలో 89 డివిజన్స్ లో బీజేపీ, 29 డివిజన్స్ లో టిఆర్ఎస్, 17 డివిజన్స్ లో ఎంఐఎం, రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచాయి. మిగిలిన చోట్లా ఎవరికీ ఆధిక్యం రాలేదు.
– పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి, మొదలైన మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ
– పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు 132/150: 81 డివిజన్స్ లో బీజేపీ, 31 డివిజన్స్ లో టిఆర్ఎస్, 16 డివిజన్స్ లో ఎంఐఎం, నాలుగు చోట్ల కాంగ్రెస్ ఆధిక్యం
– కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు: 67 డివిజన్స్ లో బీజేపీ, 30 డివిజన్స్ లో టిఆర్ఎస్, 12 డివిజన్స్ లో ఎంఐఎం, ఒక చోట కాంగ్రెస్ ఆధిక్యం
– పోస్టల్ బ్యాలెట్స్ 58/150- బీజేపీ 38 డివిజన్స్, టిఆర్ఎస్ 19 డివిజన్స్ , కాంగ్రెస్ -1
– 22 డివిజన్స్ లో బీజేపీ ఆధిక్యం, 6 చోట్ల టిఆర్ఎస్ ఆధిక్యం. రామంతాపూర్, మూసాపేట, వనస్థలిపురం, వెంకటాపురం, మల్కాజ్ గిరి డివిజన్స్ లో ఆధిక్యంలో బీజేపీ
– పోస్టల్ బ్యాలెట్ లలో ఆధిక్యంలో బీజేపీ
– 14 డివిజన్స్ లో బీజేపీ ఆధిక్యం, 6 చోట్ల టిఆర్ఎస్ ఆధిక్యం
– శేరిలింగంపల్లి డివిజన్ లో ఆధిక్యంలో టిఆర్ఎస్
– గ్రేటర్ లో మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రెగ్యులర్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో పరిధిలో 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో డివిజన్కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. 16 డివిజన్లకు మాత్రం రెండు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. రౌండ్కు 14 వేల ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఈ ఎన్నికల్లో 1,122 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. మరోవైపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి పార్టీల అధిక్యంపై స్పష్టత రానుండగా, సాయంత్రం 5 గంటల లోపులో తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ