దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36,595 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 4, శుక్రవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 95,71,559 కు చేరుకుంది. కరోనాతో మరో 540 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,39,188 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 90 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 42,916 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 90,16,289 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.20 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,16,082 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశంలో ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్ గడ్, గుజరాత్, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 36,595 కేసులలో 75.76 శాతం ఈ 10 రాష్ట్రాలలో నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ