జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ నగరంలో రోడ్ షోలు నిర్వహిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 28, శనివారం నాడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నగరంలోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో మంత్రులు కేటిఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ పలువురు పార్టీ నాయకులు ఈ రోజు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తో మంత్రి కేటిఆర్ చర్చించారు. ఇక ప్రచారానికి గడువు మూడు రోజులే ఉండడంతో టిఆర్ఎస్ కీలక నాయకులంతా నగరంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ