తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్సింగ్ వాఘేలా సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకున్న శంకర్సింగ్ వాఘేలాకు సీఎం కేసీఆర్ పుష్ఫగుచ్ఛం అందించి, శాలువా కప్పి స్వాగతం పలికారు. అనంతరం ప్రగతిభవన్ లో ఇరువురూ సమావేశమయ్యారు. ప్రస్తుత దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం, అలాగే జాతీయస్థాయిలో పార్టీ స్థాపన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇటీవల పలు రాష్ట్రాల పర్యటించడంతో పాటుగా పలువురు నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్ మాజీ సీఎం శంకర్సింగ్ వాఘేలా సీఎం కేసీఆర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వాఘేలా బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం రాష్ట్రీయ జనతా పార్టీ పెట్టి, 1996 అక్టోబర్ లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత వాఘేలా కాంగ్రెస్ పార్టీలో ప్రధాన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. 1999 మరియు 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కపద్వాంజ్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. మే 2004లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2013-17 సమయంలో గుజరాత్ అసెంబ్లీ ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఇక 2022 గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో వాఘేలా 2022 ఆగస్టు 21న ప్రజా శక్తి డెమోక్రటిక్ పార్టీ అనే కొత్త పార్టీని ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY