గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు అయింది. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్ కు హైకోర్టు బుధవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, 3 నెలల వరకు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చెయ్యొద్దని మరియు విడుదల సందర్భంగా ర్యాలీలు నిర్వహించవద్దని హైకోర్టు షరతులు విధించినట్టు తెలుస్తుంది.
ముందుగా ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అక్టోబర్ 23న రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొన్ని పరిణామాల అనంతరం ఆగస్టు 25న హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను చర్లపల్లి జైలులో రిమాండ్ కు తరలించారు. ఇటీవలే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదును వ్యతిరేకిస్తూ ఆయన సతీమణి ఉషాభాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై పలు దఫాల విచారణలో భాగంగా ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్, రాజాసింగ్ తరపు ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు తాజాగా రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కావడంతో దాదాపు 75 రోజుల అనంతరం రాజాసింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE