సచివాలయ భవనాల కూల్చివేతకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కు హైకోర్టులో ఊరట లభించింది. భవనాల కూల్చివేత కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కూల్చివేత పనులు నిలివివేయాలని పిఎల్ విశ్వేశ్వర్ ధాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సచివాలయ భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం వివరణ ఇవ్వడంతో ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. దీంతో ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకుని కూల్చివేత పనులను చేపడుతుందని, కోవిడ్-19 దృష్టిలో ఉంచుకుని పనులు జరుపుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. హైకోర్టు తాజా అనుమతితో కూల్చివేతకు అడ్డంకులు తొలిగిపోవడంతో పనులు తిరిగి మళ్లీ ప్రారంభమయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu